సెల్​బేలో రెడ్​మీ నోట్ 12 ఫోన్లు

సెల్​బేలో రెడ్​మీ నోట్ 12 ఫోన్లు

    లాంచ్​ చేసిన నటి నిహారిక

హైదరాబాద్​, వెలుగు:  మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్  సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బే.. షావోమీ లేటెస్ట్​ మిడ్​రేజ్​5జీ ఫోన్​ రెడ్​మీ నోట్ 12  సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్ల అమ్మకాలను మొదలుపెట్టింది. గచ్చిబౌలి  షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  జరిగిన లాంచ్​ కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా నటి నిహారిక కొణిదెల వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బేతో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఇంతకు ముందు కూడా ఒక సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బే షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించానని చెప్పారు. ఈ సంస్థ తన కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అత్యుత్తమ ఉత్పత్తులను,  సేవలను సమర్థంగా అందజేస్తోందని ప్రశంసించారు. రెడ్​మీ నోట్​12 సిరీస్ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయని అన్నారు. షావోమీ తెచ్చిన అత్యుత్తమ హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఇదీ ఒకటి అని ఆమె చెప్పారు.  సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బే మేనేజింగ్ డైరెక్టర్  సోమ నాగరాజు మాట్లాడుతూ రెడ్​మీ 12 నోట్​ సిరీస్​ను పరిచయం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. 

‘‘షావోమీ 5జీ వాడకాన్ని మరింత పెంచాలనే టార్గెట్​తో పనిచేస్తోంది. నోట్​12 ప్రో  ఫోన్​ 19 నిమిషాల్లో 100శాతం చార్జ్​ అవుతుంది. ఫోన్​తోపాటు 67 వాట్ల చార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వస్తుంది.  రెడ్​మీ నోట్​ 12 ప్రో ద్వారా వచ్చే 120 వాట్ల చార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 15 నిమిషాలలో ఫోన్​ పూర్తిగా చార్జ్​ అవుతుంది. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్లలో 200 ఎంపీ కెమెరా సెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.  రెడ్​మీ నోట్​ 12 ప్రో ప్లస్​లో ప్రో-గ్రేడ్ హెచ్​పీఎక్స్​ సెన్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐఓఎస్​ ఉండటం వల్ల తక్కువ వెలుతురులోనూ ఫొటోలు బాగా వస్తాయి. ఈ ఫోన్లను గేమ్ ​లవర్స్​ కూడా ఇష్టపడతారు”అని అన్నారు.   సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బే స్ట్రాటజీ & ప్లానింగ్ డైరెక్టర్ నల్లచెరువు సుహాస్  మాట్లాడుతూ రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీ నోట్ సిరీస్ ఫోన్లు పలు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నోట్12(4జీబీ+128జీబీ,  6జీబీ+128జీబీ), నోట్​12ప్రో(6జీబీ+128జీబీ,8జీబీ+128జీబ,8జీబీ+256జీబీ),  నోట్​12ప్రో ప్లస్​ఫోన్లు 8జీబీ+256జీబీ కాన్ఫిగరేషన్​తో వస్తాయన్నారు. వీటి ధరలు రూ.18 వేల నుంచి మొదలవుతాయి. ఆర్కిటిక్ వైట్, ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ బ్లూ,  అబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.