న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు రిటైల్ స్టోర్లను చేజిక్కించుకుంది. ఫ్యూచర్ ఉద్యోగులకు జాబ్స్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ విషయమై ఫ్యూచర్స్–అమెజాన్ మధ్య వివాదం నడుస్తున్నప్పటికీ రిలయన్స్ ఈ డీల్ను పూర్తి చేసింది. ఈ విషయమై పలు కోర్టుల్లో అమెజాన్ కేసులు కూడా వేసింది. రిలయన్స్ మాత్రం బిగ్బజార్ వంటి స్టోర్లను తన బ్రాండ్ పేర్లతో ముస్తాబు చేస్తోంది. ఇక నుంచి ఫ్యూచర్ ఉద్యోగులకు రియలన్స్ రిటైల్ పేరోల్ నుంచి జీతాలు ఇస్తామని తెలిపింది. ఈ విషయమై మాట్లాడటానికి అమెజాన్ అంగీకరించలేదు. ఫ్యూచర్స్ స్టోర్ల కొనుగోలు కోసం రిలయన్స్ 2020లోనే డీల్ కుదుర్చుకుంది. అయితే ఫ్యూచర్స్ కూపన్లో ఇది వరకే తమకు వాటా ఉంది కాబట్టి రిటైల్ సెగ్మెంట్ కూడా తమకే దక్కాలని అమెజాన్ వాదిస్తోంది. అప్పుల్లో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపారాన్ని రిలయన్స్కు 2020 ఆగస్టులో అమ్మింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. దీనిపై అమెజాన్ మొదటి నుంచి అభ్యంతరం చెబుతోంది.
