హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ కవితకు అరుదైన ఆహ్వానం అందింది. మలేషియాలోని కౌలాలంపూర్ లో మార్చి 2 నుంచి 4 వరకు ప్రపంచ తెలుగు మహిళాసభలకు ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం కవితను కోరగా ఆమె అంగీకరించినట్టు కార్యక్రమ నిర్వహాకులు తెలిపారు. మలేషియా తెలుగు సంఘం, ఇంటిగ్రేటెడ్ రేర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
