న్యూఢిల్లీ: మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి విదేశాల నుంచి విరాళాలు తీసుకునేందుకు ఉన్న లైసెన్స్ రెన్యువల్కు కేంద్ర హోం శాఖ అనుమతిచ్చింది. ఈమేరకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద చారిటీ విరాళాలు పొందవచ్చని పేర్కొంది. ఎఫ్సీఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ రెన్యువల్కు చారిటీ పెట్టుకున్న అప్లికేషన్ను డిసెంబర్ 25న కేంద్రం రిజెక్ట్ చేసింది. అప్లికేషన్ ప్రాసెస్లో లోపాలు ఉండడంవల్లే రిజిస్ట్రేషన్ను తిరస్కరించామని పేర్కొంది. వాటిని సరిదిద్ది నిబంధనల మేరకు మరోసారి దరఖాస్తు చేయడంతో కేంద్రం అనుమతిచ్చింది.
