ఇది వరకే హెక్టర్ మోడల్తో ఆకట్టుకున్న మోరిస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటర్ ఇండియా గురువారం ఇండియా మార్కెట్లోకి ‘జెడ్ఎస్ ఈవీ’ పేరుతో ఇంటర్నెట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేసింది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.20.88 లక్షలు. ఎక్స్క్లూజివ్ వెర్షన్ ధర రూ.23.58 లక్షలు. ఇందులోని 44.5 కిలోవాట్ల బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 340 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 40 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేయొచ్చు.

