భారతదేశపు మొట్టమొదటి K -పాప్ కళాకారిణిగా శ్రియా లెంకా చరిత్ర కెక్కింది. 18 ఏళ్ల ఈ ఒడిశా యువతి బ్రెజిల్కు చెందిన గాబ్రియేలా డాల్సిన్తో పాటు దక్షిణ కొరియా అమ్మాయికి చెందిన గ్రూప్ బ్లాక్ స్వాన్లో చేరనుంది. ఈ వివరాలను బ్లాక్స్వాన్ లేబుల్ DR మ్యూజిక్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కొత్త సభ్యుల చేరికను ప్రకటించింది. గత ఆరు నెలలుగా జరిగిన గ్లోబల్ ఆడిషన్ ప్రోగ్రామ్ తర్వాత శ్రియ, గాబ్రియేలా ఎంపికయ్యారని పేర్కొంది.
శ్రియా లెంకా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు....
- 2003లో రూర్కెలాలో జన్మించిన లెంకా ఒడిస్సీ, ఇతర సమకాలీన నృత్యాలలో శిక్షణ పొందింది.
- తన స్నేహితులలో ఒకరు ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం కె పాప్ కు లెంకాను పరిచయం చేసారు.
- ఆమెకు BTS, స్ట్రే కిడ్స్, ది బాయ్జ్ వినడం అంటే చాలా ఇష్టం.
- సరైన హిందుస్థానీ క్లాసికల్ వోకల్ ట్రైనర్ని కనిపెట్టడంలో తన అమ్మమ్మ తనకు సహాయపడిందని లెంకా గతంలోనే వెల్లడించారు. కానీ పాశ్చాత్య పాటల కోసం, ఆమె ఆన్లైన్ వీడియోలపై ఆధారపడవలసి వచ్చింది.
- కోవిడ్- నిబంధనల కారణంగా స్టూడియోలు, డ్యాన్స్ అకాడమీలు మూసివేసినందున లెంకా... తన ఇంట్లోనే ఆడిషన్లకు సిద్ధమయ్యేది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె తన టెర్రస్నే ఓపెన్-ఎయిర్ టెర్రస్గా మార్చింది. అక్కడే తన ఆడిషన్ వీడియోలను కూడా రికార్డ్ చేసేది.
