మీడియా, ఎంటర్​టెయిన్​మెంట్​ ఇండస్ట్రీ రెవెన్యూ రూ. 1.60 లక్షల కోట్లు

మీడియా, ఎంటర్​టెయిన్​మెంట్​ ఇండస్ట్రీ రెవెన్యూ రూ. 1.60 లక్షల కోట్లు

12-14 శాతం గ్రోత్​రేటుకు ఛాన్స్​
చివరి క్వార్టర్లో జనరల్​ ఎలక్షన్ల యాడ్​ రెవెన్యూ 
సినిమా థియేటర్ల కలెక్షన్లు వచ్చే ఏడాది పుంజుకుంటాయ్​
క్రిసిల్​ రిపోర్టు వెల్లడి

న్యూఢిల్లీ : 
ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో మీడియా, ఎంటర్​టెయిన్​మెంట్​ ఇండస్ట్రీ రెవెన్యూ రూ. 1.60 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్​ ఏజన్సీ క్రిసిల్​ ఒక రిపోర్టులో వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ రెవెన్యూ 12 నుంచి 14 శాతం గ్రోత్​ సాధిస్తుందని పేర్కొంది. డిజిటల్​ ప్లాట్​ఫామ్స్​ అడ్వర్టైజింగ్​ రెవెన్యూ భారీగా పెరుగుతున్నదని, ఆ తర్వాత ప్లేస్​లలో టీవీ, ప్రింట్​ మీడియా ఉంటాయని కూడా క్రిసిల్​ ఈ రిపోర్టులో  తెలిపింది. మీడియా, ఎంటర్​టెయిన్​మెంట్​ సెక్టార్​ మొత్తం రెవెన్యూలో అడ్వర్టైజింగ్​ రెవెన్యూ వాటా 55 శాతం దాకా ఉంటుందని వివరించింది. దేశంలో ఎకనమిక్​ యాక్టివిటీ ఊపందుకోవడంతో ఈ రెవెన్యూ 14 శాతం పెరిగే ఛాన్స్​ ఉందని వెల్లడించింది. వచ్చే ఏడాది దేశంలో జనరల్​ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో అడ్వర్టైజింగ్​ రెవెన్యూ ఈ ఫైనాన్షియల్​ చివరి క్వార్టర్లో ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని క్రిసిల్​ పేర్కొంది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో సబ్​స్క్రిప్షన్​ రెవెన్యూ శాతం మాత్రమే పెరుగుతుందని, మొత్తం రెవెన్యూలో సబ్​స్క్రిప్షన్​ రెవెన్యూ వాటా 45 శాతమని వివరించింది. అడ్వర్టైజింగ్​ రెవెన్యూలో ఎక్కువ వాటా టెలివిజన్​ మీడియానే దక్కించుకుంటోందని, డిజిటల్​ కూడా జోరందుకుంటోందని క్రిసిల్​ రేటింగ్​ డైరెక్టర్​ నవీన్​ వైద్యనాథన్​ చెప్పారు. గత కొన్నేళ్లలో డిజిటల్​ ప్లాట్​ఫామ్​లు ఊపందుకున్నాయని, ఈ ప్లాట్​ఫామ్స్​ రెవెన్యూ  15 నుంచి 18 శాతం దాకా ఎగిసే ఛాన్స్​ ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత అడ్వర్టైజింగ్​ రెవెన్యూలో  డిజిటల్​ సెకండ్​ ప్లేస్​లోకి చేరింది.

టెలివిజన్​ మీడియా మొదటి ప్లేస్​లో కొనసాగుతోంది. ఈ రెండూ కలిపి మొత్తం అడ్వర్టైజింగ్​ రెవెన్యూలో మూడొంతులు దక్కించుకుంటున్నాయని వైద్యనాథన్​ వెల్లడించారు. ఇక ప్రింట్​ మీడియా అయిదో వంతు వాటాను దక్కించుకోగలుగుతోందని వివరించారు. వచ్చే ఫైనాన్షియల్​ ఇయర్లో ప్రింట్​ మీడియా కూడా అడ్వర్టైజింగ్​రెవెన్యూలో   మెరుగైన గ్రోత్​ సాధించనుందని, ఇది  15 శాతం దాకా ఉంటుందని పేర్కొన్నారు. ప్రింట్​ మీడియా రెవెన్యూ మాత్రం కరోనా ముందు లెవెల్స్​తో పోలిస్తే తక్కువే ఉంటుందని క్రిసిల్​ రిపోర్టు వెల్లడించింది. రేడియో, అవుట్​డోర్​ మీడియాలు మాత్రం వచ్చే ఏడాది కరోనా ముందు లెవెల్స్​ను అందుకునే సంకేతాలున్నాయని పేర్కొంది. కరోనా టైములో బాగా దెబ్బతిన్న సినిమా థియేటర్ల కలెక్షన్లు (నాన్​ యాడ్​ రెవెన్యూ)  2024లో ఏకంగా 30 శాతం పెరిగే ఛాన్స్​ ఉన్నట్లు వెల్లడించింది. ఆక్యుపెన్సీ జోరందుకోవడంతోపాటు, కొత్త స్క్రీన్ల ఏర్పాటు కూడా ఇందుకు కారణమని తెలిపింది.