రైల్వేపై న్యాయపోరాటం

రైల్వేపై న్యాయపోరాటం

రాజస్థాన్ : టికెట్ రద్దు చేసుకుంటే చార్జీ ఎక్కువ తీసుకున్నరని ఓ ప్రయాణికుడు రైల్వేపై న్యాయపోరాటం చేసిండు.. రోజుల తరబడి అన్ని డిపార్ట్​మెంట్లకు తిరిగిండు. ప్రధానితో పాటు రైల్వే మంత్రి, అధికారులకు ట్వీట్లు చేసిండు. ఇట్లా ఐదేండ్ల పాటు పోరాడి, చివరకు తనకు రావాల్సిన 35  రూపాయలను రాబట్టుకున్నడు. ఆయన పోరాటం వల్ల ఇప్పుడు దాదాపు 3 లక్షల మందికి డబ్బులు తిరిగొస్తున్నాయి. ఆ ప్రయాణికులు అందరికీ రూ. 35 చొప్పున బ్యాంకులో వేస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఈ మొత్తం రూ.2.43 కోట్లు.

ఏం జరిగిందంటే..
కోటాకు చెందిన సుజిత్​ స్వామి 2017 ఏప్రిల్​లో ఢిల్లీ వెళ్లడానికి రైలు టికెట్​ రిజర్వేషన్​ చేసుకున్నాడు. అనుకోని కారణాల వల్ల ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నడు. క్యాన్సిలేషన్​ కింద రైల్వే రూ.100 మినహాయించుకుని మిగతా సొమ్మును సుజిత్​ఖాతాలో వేసింది. అయితే, అప్పటికి జీఎస్టీ అమలులోకి రాలేదని, క్యాన్సిలేషన్​ చార్జీ కింద రూ.35 సర్వీస్​ టాక్స్ ఎట్లా విధిస్తారని రైల్వే శాఖను సుజిత్​ నిలదీసిండు. దీనిపై రెండేండ్లు ఫైట్​ చేస్తే.. 2019లో పొరపాటైందని చెప్పి ఐఆర్​సీటీసీ 33 రూపాయలను సుజిత్​ ఖాతాలో జమ చేసింది. తనకు రావాల్సింది 35 రూపాయలని, మిగతా 2 రూపాయలు కూడా ఇవ్వాలని సుజిత్​ కోరిండు. ఇందుకోసం మరో మూడేండ్లు ఫైట్​ చేసిండు. కిందటి శుక్రవారం ఐఆర్​సీటీసీ 2 రూపాయలను సుజిత్​ ఖాతాలో వేసింది. 

మరిన్ని వార్తల కోసం : -

పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ను ప్రారంభించిన ప్రధాని


మోడీ ప్రభుత్వానికి భారీగా పెరిగిన అప్రూవల్​ రేటింగ్​