అనుమతిలేకుండా ఏ పార్ట్ కూడా టచ్​ చేయొద్దు

అనుమతిలేకుండా ఏ పార్ట్ కూడా టచ్​ చేయొద్దు

ముంబై: మహిళ అనుమతి లేకుండా ఆమె పాదాలనే కాదు బాడీలో ఏ పార్ట్​టచ్​చేసినా..ఆమె గౌరవానికి భంగం కలిగించడమేనని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. తాను మహిళ పాదాలను మాత్రమే టచ్​చేశానని, కింది కోర్టులో వేసిన శిక్షను సవాలు చేస్తూ ఓ నిందితుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్​పై జస్టిస్​ఎంజీ సెవ్లికర్​ ఆధ్వర్యంలోని బెంచ్​ విచారణ చేపట్టింది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2014 జూలైలో అర్ధరాత్రి వేళ తన భర్త ఇంట్లో లేని సమయంలో తన పాదాలను తాకాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు 2015 జూన్​లో జల్నా సెషన్స్​ కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ.. ఏడాది జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు బాంబే హైకోర్టుకు వెళ్లాడు. తన క్లయింట్​ లైంగిక ఉద్దేశంతో ఆమె పాదాలను తాకలేదని పిటిషనర్ ​తరఫు లాయర్​ వాదించారు. ఈ వాదనలతో సంతృప్తి చెందని కోర్టు.. నిందితుడు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి, మహిళ అనుమతి లేకుండా పాదాలను తాకడం చూస్తుంటే.. లైంగిక ఉద్దేశంతోనే ఆ పని చేసినట్లు తెలుస్తోందని పేర్కొంది. మహిళ అనుమతి లేకుండా పాదాలను కాదు..  బాడీలోని ఏ పార్ట్​టచ్​చేసినా ఆమె గౌరవానికి భంగం కలిగించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది. కింది కోర్టు తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు.. నిందితుడి పిటిషన్​ను కొట్టేసింది.