నేను సింహం కొడుకును..ఎవరికీ భయపడను

నేను సింహం కొడుకును..ఎవరికీ భయపడను

సొంత మనుషులే తనను మోసం చేశారన్నారు LJP నేత చిరాగ్ పాశ్వన్. ఎన్ని కుట్రలు చేసినా విజయం తనదే అన్నారు. తన తండ్రి రాం విలాస్ పాశ్వన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళి అర్పించారు. పాశ్వన్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. తండ్రి జయంతి సందర్భంగా బిహార్ లోని హజీపూర్ నుండి ఆశీర్వాద్ యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు పాశ్వన్. ప్రతి జిల్లాకు వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటానన్నారు. తాను సింహం కొడుకునన్న పాశ్వన్...ఎవరికీ భయపడబోనన్నారు.