ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే ఒకినోవా కంపెనీ యువతను టార్గెట్ పెట్టుకొని ఇండియా మార్కెట్లోకి ‘లైట్ ఎక్స్వీ’ మోడల్ను తీసుకొచ్చింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.59,990లు. ఇందులోని లిథియం ఆయాన్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగుతీస్తుంది. చార్జింగ్కు దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది. బ్యాటరీలపై మూడేళ్ల వారంటీ ఇస్తామని కంపెనీ చెప్తోంది.
