బోర్డు మెంబర్ సెక్రటరీకి ఏపీ ప్రపోజల్
అక్కడి నుంచి మానిటరింగ్ కష్టమంటున్న రాష్ట్ర ఇంజనీర్లు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) హెడ్డాఫీసును వైజాగ్లో ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు కోరింది. రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం మేరకు.. తమ ప్రభుత్వం వైజాగ్ లో బోర్డు హెడ్ క్వార్టర్స్ పెట్టాలని నిర్ణయించిందని ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఇటీవల కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురేకు లెటర్ రాశారు. వైజాగ్లో బోర్డు ఏర్పాటుకు అవసరమైన బిల్డింగ్ ను వెతుకుతున్నామని.. అది తేలగానే బోర్డుకు సమాచారమిస్తామని పేర్కొన్నారు. కృష్ణా నదికి సంబంధం లేకుండా, ఎక్కడో దూరంగా బోర్డు హెడ్క్వార్టర్స్ పెడితే ఇబ్బంది వస్తుందని మన రాష్ట్ర ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ ప్రపోజల్ను వ్యతిరేకించాలని సర్కారును కోరుతామన్నారు.
ఏపీకే కృష్ణా బోర్డు..
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా.. కృష్ణా, గోదావరి నదీ జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ (గోదావరి బోర్డు)లను ఏర్పాటు చేసింది. జీఆర్ఎంబీ హైదరాబాద్ నుంచి, కేఆర్ఎంబీ ఏపీ నుంచి పనిచేయాలని చట్టంలో చేర్చింది. ఏపీ
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ను నిర్ణయించుకున్న నేపథ్యంలో.. కృష్ణా బోర్డు హెడ్
క్వార్టర్స్ను కూడా అక్కడే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
for more News..
కరోనా లాక్డౌన్ టైమ్ కుటుంబాలకు మేలే చేసింది
హైదరాబాద్లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్
