కింగ్ చార్లెస్​ పై తియ్యటి అభిమానం.. చాక్లెట్​ శిల్పం

కింగ్ చార్లెస్​ పై తియ్యటి అభిమానం.. చాక్లెట్​ శిల్పం

బ్రిటన్​ కింగ్ చార్లెస్​3కు మే 6న పట్టాభిషేకం జరగబోతోంది. అందుకని ఆయన మీద అభిమానంతో చాకొలెటీయర్ జెన్నిఫర్ లిండ్సే క్లార్క్ తన టీంతో కలిసి చాక్లెట్​ శిల్పాన్ని తయారు చేసింది. అభిమానుల ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో తెలియజేసేందుకు రకరకాల చాకొలెట్​లు వాడి ఈ శిల్పాన్ని తయారు చేశారు. దీనికోసం అక్షరాల 17 లీటర్ల చాకొలెట్స్ వాడారు. ఇరవై మూడు కేజీలున్న ఈ శిల్పాన్ని తయారుచేయడానికి నాలుగు వారాలు పట్టిందట.

దీని తయారీ కోసం చాకొలెటీర్స్, మోడల్ మేకర్స్ కలిసి ఎంతో జాగ్రత్తగా ఆయన ప్రొఫైల్​ వ్యూ, ఫుటేజీలను అణువణువూ పరిశీలించారు. మొత్తానికి ఈ తియ్యటి శిల్పాన్ని తయారు చేశారు. దీన్ని పట్టాభిషేకం రోజున ఎగ్జిబిషన్​లో పెట్టబోతున్నారు. అంతేకాదు.. పట్టాభిషేకానికి చార్లెస్ ఈ శిల్పంలో ఉన్నట్టే తయారై వస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్లంతా. శిల్పానికి వేసిన డ్రెస్, అవే ఆభరణాలతో కనిపిస్తాడని అనుకుంటున్నారు. ఇంతకీ కింగ్​ చార్లెస్​ ఎలా రెడీ అవుతాడో తెలియాలంటే మే 6వ తేదీ వరకు ఆగాల్సిందే.