
బ్రిటన్ కింగ్ చార్లెస్3కు మే 6న పట్టాభిషేకం జరగబోతోంది. అందుకని ఆయన మీద అభిమానంతో చాకొలెటీయర్ జెన్నిఫర్ లిండ్సే క్లార్క్ తన టీంతో కలిసి చాక్లెట్ శిల్పాన్ని తయారు చేసింది. అభిమానుల ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో తెలియజేసేందుకు రకరకాల చాకొలెట్లు వాడి ఈ శిల్పాన్ని తయారు చేశారు. దీనికోసం అక్షరాల 17 లీటర్ల చాకొలెట్స్ వాడారు. ఇరవై మూడు కేజీలున్న ఈ శిల్పాన్ని తయారుచేయడానికి నాలుగు వారాలు పట్టిందట.
దీని తయారీ కోసం చాకొలెటీర్స్, మోడల్ మేకర్స్ కలిసి ఎంతో జాగ్రత్తగా ఆయన ప్రొఫైల్ వ్యూ, ఫుటేజీలను అణువణువూ పరిశీలించారు. మొత్తానికి ఈ తియ్యటి శిల్పాన్ని తయారు చేశారు. దీన్ని పట్టాభిషేకం రోజున ఎగ్జిబిషన్లో పెట్టబోతున్నారు. అంతేకాదు.. పట్టాభిషేకానికి చార్లెస్ ఈ శిల్పంలో ఉన్నట్టే తయారై వస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్లంతా. శిల్పానికి వేసిన డ్రెస్, అవే ఆభరణాలతో కనిపిస్తాడని అనుకుంటున్నారు. ఇంతకీ కింగ్ చార్లెస్ ఎలా రెడీ అవుతాడో తెలియాలంటే మే 6వ తేదీ వరకు ఆగాల్సిందే.