రాహుల్, సోనియాపై తప్పుడు వార్తలు.. బంగ్లా జర్నలిస్ట్‌‌‌‌పై కేసు

బెంగళూరు: లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌గాంధీ, ఆయన తల్లి, కాంగ్రెస్​ అగ్రనేత సోనియాపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్‌‌‌‌కు చెందిన ఓ జర్నలిస్ట్​పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, ఇండియాకు చెందిన ఓ న్యూస్‌‌‌‌ పోర్టల్‌‌‌‌ మహిళా సిబ్బందిపైనా ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేశారు. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) నేత శ్రీనివాస్  ఫిర్యాదు మేరకు జర్నలిస్టు సలా ఉద్దీన్ షోయబ్ చౌదరి, న్యూస్‌‌‌‌ పోర్టల్‌‌‌‌ మహిళా ఉద్యోగి అదితిపై హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో కేసు నమోదైంది. 

సోనియా గాంధీని విదేశీ గూఢచారి అంటూ బంగ్లాదేశ్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌ షోయబ్‌‌‌‌ చౌదరి తన ట్విట్టర్‌‌‌‌ అకౌంట్‌‎‌లో పోస్ట్‌‌‌‌ పెట్టారని.. అలాగే, రెండుమతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్‌‌‌‌ని షేర్‌‌‌‌ చేశారని ఆయన ఆరోపించారు. అలాగే, రాహుల్‌‌‌‌ గాంధీపైన కూడా పలు ఆరోపణలు చేసినట్టు శ్రీనివాస్‌‌‌‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా.. సలా ఉద్దీన్ షోయబ్, అదితిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.