రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం తీసుకుంది కర్ణాకట రాష్ట్రం. ఇంట్లో ఇంట్లో టీవీ, ఫ్రిజ్ ఉంటే వారు… కార్డు వెంటనే తిరిగి ఇచ్చేయాలని..లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అంతేకాదు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
టీవీ, ఫ్రిజ్ తో పాటు మరి కొన్ని పరిమితులు కూడా విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. 5ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండకూడదని, మోటార్ సైకిల్ కూడా ఉండకూడదన్నారు. రూ. 1.20లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం పొందేవారు రేషన్ కార్డులు ఉపయోగించకూడదన్నారు. ఇవి ఉన్న రేషన్ లబ్ధిదారులు మార్చి 31లోగా కార్డులను తిరిగిచ్చేయాలని, లేదంటే వారిపై చర్యలు తప్పవన్నారు మంత్రి ఉమేశ్.
మంత్రి ఉమేశ్ వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు రేషన్ షాపుల ఎదుట పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీవీ, ఫ్రిజ్ లాంటివి ఇప్పుడు నిత్యావసరమయ్యాయని తెలిపారు.అవి ఉన్నంత మాత్రాన రేషన్ తొలగించడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
