కేసు ఫైల్ చేయలేదని పోలీసును రోడ్డు ఊడ్చమన్న కోర్టు

కేసు ఫైల్ చేయలేదని పోలీసును రోడ్డు ఊడ్చమన్న కోర్టు
బాధితులు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేయలేదని ఓ పోలీసు అధికారిని రోడ్డు ఊడ్చాలంటూ కోర్టు తీర్పిచ్చిన ఘటన కర్ణాటకలో జరిగింది. కల్బుర్గిలో నివసించే తారాబాయి అనే మహిళ.. తన కొడుకు సురేష్ అక్టోబర్ 20న తప్పిపోయాడని స్థానిక బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అయితే ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్టేషన్ హౌస్ ఆఫీసర్ నమోదు చేయలేదు. దాంతో తారాబాయి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పరిశీలించిన కోర్టు.. సదరు ఎస్‌హెచ్ఓను స్టేషన్ ముందు వారం పాటు రోడ్డు ఊడ్చాలంటూ డిసెంబర్ 17న తీర్పునిచ్చింది. కల్బుర్గి సిటీ కమిషనర్ సతీష్ మాట్లాడుతూ.. ‘కోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మేం అప్పీల్ దాఖలు చేస్తాము. కేసు విషయంలో మా పోలీసుల వద్ద ఎటువంటి లొసుగులు లేవని మేం భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. కాగా.. కోర్టును ఆశ్రయించిన మహిళ తన కొడుకును కిడ్నాప్ చేశారనే ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్లో సంప్రదించిందని.. కానీ బాలుడిని కనుగొనబడలేదని ఎస్‌హెచ్ఓ అంగీకరించినట్లు కోర్టు పేర్కొంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. ‘జీరో ఎఫ్ఐఆర్’ గురించి జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులందరికీ వర్క్‌షాప్ నిర్వహించాలని కర్ణాటక హైకోర్టు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. For More News.. వీడియో: షారూర్ ఖాన్‌లా వార్నర్.. సోషల్ మీడియాలో వైరల్ అప్పులకు ఫుల్ డిమాండ్​! లాక్‌డౌన్‌లో పానీ పూరికి 2 లక్షల ఆన్‌లైన్‌ ఆర్డర్లు