కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షడు డీకే శివకుమార్కు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బెంగళూరు నుంచి కోలార్కి హెలికాప్టర్లో బయల్దేరారు. ఈ క్రమంలో ఆకాశంలో ఉండగానే హెలికాప్టర్ ని 100 అడుగుల ఎత్తులో ఉండగా రాబందు తాకింది. దీంతో ముందు వైపు అద్దానికి పగుళ్లు వచ్చాయి. ఆ పగుళ్లు గాలి వేగానికి పెద్దవిగా మారాయి.
అయితే ముందుగానే ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా హెలికాప్టర్ అద్దం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ మేరకు డీకే శివకుమార్ ట్వీట్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10 న జరగనుండగా, మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. కాగా రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కన్నడ నాట ఈ సారి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.
