కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీకి ఎన్నికల సంఘం మరోసారి టార్చ్ లైటు గుర్తునే కేటాయించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో టార్చ్ లైటు గుర్తును కేటాయించడంతో ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. పార్టీ గుర్తు కేటాయింపుపై స్పందించి కమల్… అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జన్మదినం రోజునే ఈ నిర్ణయం రావడం సంతోషంగా ఉందన్నారు. తమకు టార్చ్ లైట్ గుర్తును కేటాయించినందుకు ఎలక్షేన్ కమిషన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. మనందరం కలిసి వెలుగును వ్యాపింప చేద్దామంటూ మిత్రపక్షాలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అప్పట్లోనే ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్ లైటు గుర్తు కేటాయించింది.
