కపిల్ టవర్స్​లో క‌‌‌‌‌‌‌‌గూల్ మరో ఆఫీసు

కపిల్ టవర్స్​లో క‌‌‌‌‌‌‌‌గూల్ మరో ఆఫీసు

హైదరాబాద్, వెలుగు: యూకేకు చెందిన డేటా అండ్ అనలిటిక్స్, ఈఆర్పీ స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ క‌‌‌‌‌‌‌‌గూల్ గచ్చిబౌలిలోని నాన‌‌‌‌‌‌‌‌క్‌‌‌‌‌‌‌‌రాంగూడ ప్రాంతంలో ఉన్న కపిల్ టవర్స్​లో మరో ఆఫీసును ఓపెన్​ చేసింది.  200 మందికి పైగా ఉద్యోగులకు చోటు కల్పించే కొత్త 17,000 చదరపు అడుగుల ఆఫీసును  క‌‌‌‌‌‌‌‌గూల్ సీఈఓ డాన్ బార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భారతదేశం కోసం తాము ప్రకటించిన స్ట్రాటెజిక్​ గ్రోత్​ప్లాన్స్​ ప్రకారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ వారం పుణేలోనూ తమ ఆఫీసును తెరిచామని చెప్పారు.  ‘‘అంత‌‌‌‌‌‌‌‌ర్జాతీయ క‌‌‌‌‌‌‌‌స్టమ‌‌‌‌‌‌‌‌ర్లకు స‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఇవ్వడానికి హైదరాబాద్​ సెంటర్​లో మంచి అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు సంవత్సరాలలో భారతదేశంలో అంచనా పెట్టుబడులను 8 మిలియన్ డాలర్లకు పెంచాం. మా 160 -సీట్ల పుణే కేంద్రం ఈ సంవత్సరం ఆగస్టు  నుంచి డైరెక్ట్​గా సేవ‌‌‌‌‌‌‌‌లు అందిస్తుంది. 2025 నాటికి భారతదేశంలో 2000 మంది సిబ్బందితో కూడిన బలమైన కంపెనీగా ఎదుగుతాం" అని డాన్ బార్లో తెలిపారు.  ట్యాలెంట్​ ఇక్కడ చాలా ఎక్కువగా ఉండ‌‌‌‌‌‌‌‌టం వ‌‌‌‌‌‌‌‌ల్లే  గ్లోబల్ డెలివరీ & రీసెర్చ్ సెంటర్ కోసం ఇండియాను ఎంచుకున్నామని క‌‌‌‌‌‌‌‌గూల్ గ్రూప్  సీఓఓ  సీఐఓ ప్రశాంత్ పటేల్ అన్నారు.  తమ క్లయింట్లలో 80 శాతం ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎస్ఈ 100 లేదా ఎస్ అండ్ పి –500లో లిస్ట్ అయ్యాయని చెప్పారు. పోయిన క్వార్టర్​లో ఎన్ఐటీలు, బిట్స్, గీతమ్స్, జీఎన్ఐటీఎస్, కిట్స్ (వరంగల్) నుంచి గ్రాడ్యుయేట్స్​ను తీసుకున్నామని క‌‌‌‌‌‌‌‌గూల్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి తెలిపారు. ఎనలిటిక్స్, ఏఐ/ఎంఎల్‌‌‌‌‌‌‌‌, ఇంటిగ్రేషన్లు, ఎస్ఏఏఎస్ యాప్ లు, ఈఆర్పీ, వెబ్ అప్లికేషన్లు, టెస్టింగ్  ఏఎంఎస్ లాంటి రంగాల్లో ప్రొడక్టులను కగూల్​ అందిస్తుంది.