జులై 15 మహా పర్వదినం.. శని దేవుడిని.. శంకరుడిని పూజిస్తే..

జులై 15  మహా పర్వదినం.. శని దేవుడిని.. శంకరుడిని పూజిస్తే..

శనిత్రయోదశి మరియు మాస శివరాత్రి రెండూ కలిసి రావడం అనేది చాలా అరుదైన రోజు. సాధారణంగా శనిత్రయోదశే ఏ మూడు నాలుగు మాసాలకు ఒకసారి రావడం జరుగుతుంది.  అలాంటిది శనివారం ( జులై 15) త్రయోదశి  సాయంత్రానికి చతుర్ధశి  ఘడియలు రావడంతో మాస శివరాత్రి పూజలు కూడా రేపే ( జులై 15) న జరపాలి.  ఇలాంటి రోజు అనగా  శనిత్రయోదశితో కలిసి మాస శివరాత్రి రావడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అలాంటి రోజు ఈ ఏడాది జులై 15న వచ్చింది. ఆ రోజున శనికి తైలాభిషేకం, శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన ఇప్పటి వరకు పడుతున్న కష్టాలు తొలగిపోతాయని శివ పురాణంలో పేర్కొన్నారు.  

శని దేవుడిని శనీశ్వరుడు అంటారు. అంటే ఆయన ఈశ్వర స్వరూపమైన గ్రహంగా భావిస్తాము. అలంటి ఈశ్వర స్వరూపమైన శనిని ఈ పవిత్ర దినమున  (జులై 15) పూజించిన వారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. జులై 15న (ఉదయం )శనీశ్వరుడిని .. ఈశ్వరుడిని ఒకేదినములో పూజించిన వారికి కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. 
 శని బాధలు ఉన్న వారు..శని సంచరించే  రాశులవారు కింద సూచించిన మంత్ర పారాయణం అభిషేకం చేసుకోవడం చాలా మంచిది.

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయ మార్తాండ సంభూతమ్ తమ్ నమామి శనైశ్చరమ్


మాస శివరాత్రిని ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. హిందూ మతంలో మాస శివరాత్రికి  చాలా ప్రాముఖ్యత ఉంది. మాస శివరాత్రి నాడు రాత్రిపూట పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఇక శనివారం త్రయోదశి కూడా ఉంటే ఆరోజు ప్రత్యేకత అంతా ఇంతాకాదు.. ఉదయం శని దేవుడిని... సాయంత్రం  శంకరుడిని పూజించడం ద్వారా, అన్ని కోరికలు నెరవేరుతాయి. భోళాశంకరుడి  విశేష ఆశీర్వాదాలు లభిస్తాయి. మాస శివరాత్రి నాడు శివుడు, తల్లి పార్వతిని ఆచారాల ద్వారా పూజిస్తారు. మేషం నుండి మీనం వరకు ఉన్నవారు మాస శివరాత్రి రోజున తప్పనిసరిగా శివ చాలీసా పఠించాలి. శివ చాలీసా పఠించడం వల్ల శంకరుని ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని శివపురాణంలో పేర్కొన్నారు. 

 వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందాలంటే, మాస శివరాత్రి రోజున శివుడిని, పార్వతిని పూజలతో పూజించండి. ఈ రోజున  (జులై 15) శివలింగానికి గంధపు తిలకం, పార్వతి తల్లికి పూయడం శ్రేయస్కరం. మీరు పిల్లల సంతోషాన్ని కోరుకుంటే, నెలవారీ మాస శివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. ఇది మీ కోరికను నెరవేరుస్తుందని వేద పండితులు చెబుతున్నారు. . వైవాహిక జీవితంలోని సమస్యల నుండి బయటపడటానికి, మాస శివరాత్రి రోజున గౌరీ శంకర్ రుద్రాక్షను ధరించడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. . ఇది శివుడు, తల్లి పార్వతి ఇద్దరి అనుగ్రహాన్ని ఇస్తుంది. జులై 15న నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి.. సాయంత్రం శివ దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. 

భక్తులు ముందుగా శని దేవుడిని పూజించి.. తర్వాత శివుడి పూజ చేయాలని చెబుతున్నారు. సాధారణంగా జాతకంలో శని దోషం ఉన్నవాళ్లు, ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలు నడుస్తున్నవాళ్లు..  శనివారం  ( జులై15) శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్ల వస్త్రాలు, నల్ల నువ్వులు దానం చేయడంతో పాటు కాకికి నల్ల బెల్లం పెడతారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతన్నారు. శని త్రయోదశి నాడు ఇలా చేస్తే మరింత ఫలితం వస్తుందని నమ్ముతుంటారు.

పురాణాల ప్రకారం శని కరుణిస్తే అసలు కష్టాలు ఉండవట.శనికి కోపం వాస్తే ఈశ్వరుడి కైనా సరే శని దోషం తప్పదని.శని యముడికి సోదరుడు, జ్యేష్టాదేవికి భర్త, శివుడికి పరమ భక్తుడు. అతని భక్తిని శివుడు పరీక్షించాలనుకున్నాడు. నేనంటే నీకు ప్రీతి కదా, నేను ఏ రూపంలో ఉన్న సరే నన్ను గుర్తుపట్టగలవా అని పరమశివుడు శనికి ఒక షరతును విధిస్తాడు. శనిని పరీక్షించేందుకు శివుడు సూర్యోదయం సమయంలో బిల్వ వృక్షంగా మారుతాడు. ఈశ్వరుడు సాయంత్రానికి మళ్లీ మామూలు రూపంలో ప్రత్యక్షమవుతాడు. బిల్వ వృక్షం నుంచి అసలు రూపంలోకి వచ్చిన శివుడికి శని కనిపిస్తాడు.శనీశ్వర నన్ను పట్టుకోలేకపోయావుగా అని ఈశ్వరుడు చెప్పినప్పుడు అదేంటి స్వామి నేను పట్టుకోవడం వల్లే కదా మీరు బిల్వ వృక్షం రూపం దాల్చాల్సి వచ్చింది అని జవాబు చెబుతాడు.ఇలా ఈశ్వరుడు శని భక్తిని మెచ్చుకున్నాడు. బిల్వ దళాలతో శనీశ్వరుని పూజిస్తే శుభాలను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే బిల్వ దళాలతో శనీశ్వరుడిని పూజిస్తారు. ఈ రోజున (జులై 15)  పూజించడం ద్వారా బాబా భోలేనాథ్ తన భక్తుల కోరికలన్నీ తీరుస్తారని నమ్ముతారు. మాస శివరాత్రి రోజున శివునితో పాటు కుటుంబ సభ్యులందరినీ పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని చెబుతారు.