జర్నలిస్ట్ కు రూ.50వేలు సాయం

జర్నలిస్ట్ కు రూ.50వేలు సాయం

చందానగర్, వెలుగు : జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ యూనియన్​ఆఫ్​వర్కింగ్ జర్నలిస్ట్​ పనిచేస్తుందని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్​సాగర్ చెప్పారు. శేరిలింగంపల్లి ప్రెస్​ క్లబ్ సర్వసభ్య సమావేశం మంగళవారం చందానగర్​లోని పీజేఆర్​స్టేడియంలో జరిగింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి విఠల్​రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శేఖర్​సాగర్

ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్​ క్లబ్​ అధ్యక్షుడు రమేష్​ సాగర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలు, ఇండ్ల స్థలాల అంశాలపై చర్చించారు. అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్​లక్ష్మణ్​రావుకు శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్​ తరుఫున రూ.50వేల అందజేశారు.