రైతులకు గుడ్​న్యూస్​: రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటించినమరో రాష్ట్రం

రైతులకు గుడ్​న్యూస్​: రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటించినమరో రాష్ట్రం

జార్ఖండ్​ రైతులకు  అక్కడి ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. రూ. 50 వేల వరకు ఉన్న  రైతు రుణమాఫీ పరిధిని  రూ. 2 లక్షల వరకుపెంచేందుకు  ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను 2024–25 సంవత్సరానికి చెందిన బడ్జెట్​ లో ప్రవేశపెట్టనున్నారు.  ప్రస్తుతం జార్ఖండ్​ లో రూ. 50 వేల వరకు రైతు రుణ మాఫీని అమలు చేస్తుంది.  ఇప్పుడు రుణమాఫీకి దరఖాస్తులు తగ్గడంతో  .... రుణమాఫీ పరిధిని పెంచే యోచనలో ఉంది. 

ఈ ఏడాది లోక్​సభ ఎన్నికలు జరుగుతాయి.  వీటితో పాటు  జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి, ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం  రుణ మాఫీ పథకాన్ని ప్రవేశపెడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 51 వేల నుంచి రూ. లక్ష లోపు వరకు రుణాలు తీసుకున్న రైతులు 3 లక్షల మంది ఉన్నారు.  లక్ష నుంచి 2 లక్షల వరకు లోన్​ తీసుకున్న రైతులు లక్ష మంది ఉన్నారు.  ఈ రుణ మాఫీ పథకానికి రూ. 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని రాష్ట్రప్రభుత్వం అంచనావేస్తుంది.     

జార్ఖండ్​ రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంక్​ అధికారులతో రైతు రుణమాఫీ పెంపు అంశాన్ని  చర్చిస్తున్నారు.    నాన్ పెర్ఫార్మింగ్ ఖాతా (NPA)లను ప్రామాణికంగా చేయాలని బ్యాంక్​లను కోరుతున్నారు. ఆ ఖాతాలకు సంబంధించి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   దీంతో 50 వేల రూపాయిల లోపు రుణం తీసుకున్న NPA ఖాతాదారులకు కూడా లబ్ధి చేకూరనుంది.వ్యవసాయ రుణమాఫీ పథకంలో జార్ఖండ్​ లో ఇప్పటి వరకు 4 లక్షల 72 వేల 117 మంది రైతులు లబ్ధి పొందారు. 2021 సంవత్సరం నుంచి జార్ఖండ్​లో రుణమాఫీ పథకం అమల్లో ఉంది.