జమ్మూ, శ్రీనగర్‌ జాతీయ రహదారి మూసివేత

జమ్మూ, శ్రీనగర్‌ జాతీయ రహదారి మూసివేత

కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ–శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేసినట్లు ఇవాళ(సోమవారం) అధికారులు తెలిపారు. సమ్రోలి–ఉదమ్‌పూర్‌ల మధ్య ఉన్న ఈ రహదారిని మూసివేశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని  చెప్పారు.  గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోగా, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కావచ్చని ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆకాశం మేఘావృతం కావచ్చని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మీ ప్రాణాలు దక్కాలంటే పారిపోండి