ఐటీ ఇండస్ట్రీలో 3.75 లక్షల కొత్త జాబ్స్​

ఐటీ ఇండస్ట్రీలో 3.75 లక్షల కొత్త జాబ్స్​
  • మార్చి చివరకు ఐటీ ఇండస్ట్రీలో 3.75 లక్షల కొత్త జాబ్స్​
  •     ఉద్యోగుల వలస కూడా పెరుగుతోంది
  •     టీమ్​లీజ్​ డిజిటల్​ రిపోర్టు

బెంగళూరు: మన దేశంలోని ఐటీ–బీపీఎం ఇండస్ట్రీ ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో 3.75 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఒక రిపోర్టు తెలిపింది. దీంతో ఈ ఇండస్ట్రీ కల్పించిన  మొత్తం ఉద్యోగాల సంఖ్య 48.5 లక్షలకు చేరుతుందని టీమ్​లీజ్​ డిజిటల్​ వెల్లడించింది. ఐటీ–బీపీఎం ఉద్యోగాలలో ఎక్కువ ఫుల్​ టైమ్​ ఉద్యోగులే ఉంటారని, కాకపోతే కాంట్రాక్ట్​ స్టాఫింగ్​ జోరందుకుంటోందని ఈ రిపోర్టు పేర్కొంది. మార్చి 2022 నాటికి కాంట్రాక్ట్​ ఉద్యోగుల సంఖ్య 1.48 లక్షలకు పెరుగుతుందని ఈ రిపోర్టులో టీమ్​లీజ్​ డిజిటల్​ అంచనా వేస్తోంది. కంపెనీలే కాకుండా వ్యక్తులు కూడా కాంట్రాక్ట్​ స్టాఫింగ్​ విధానం పట్ల ఆసక్తి చూపిస్తున్నారని  వెల్లడించింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో కాంట్రాక్ట్​ పద్ధతిన జాయినవుతున్న వారిలో 10 నుంచి 15 శాతం మంది ఫుల్​ టైమ్​ ఎంప్లాయ్​మెంట్​ వచ్చిన వారే ఉండటం గమనించదగ్గదని పేర్కొంది.2021 ఫైనాన్షియల్​ ఇయర్లో 13 డిజిటల్​ స్కిల్స్​కు ఆపర్చునిటీస్​ ఎక్కువగా ఉన్నాయని, ఈ జాబ్స్​ 7.5 శాతం పెరుగుతాయని టీమ్​లీజ్​ డిజిటల్​ రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది డిజిటల్​ స్కిల్స్​ కాంట్రాక్ట్​ జాబ్స్​ ఏకంగా 50 శాతం పెరగనున్నట్లు తెలిపింది. డేటా ఇంజినీరింగ్​, డేటా సైన్స్​, మెషిన్​ లెర్నింగ్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ స్కిల్స్​లో డిమాండ్​–సప్లయ్​ల మధ్య గ్యాప్​ పెరుగుతున్నట్లు వివరించింది. సప్లయ్​ ప్రోబ్లమ్​ నుంచి బయటపడటానికి కంపెనీలు తమ ఉద్యోగులకు అప్​స్కిల్లింగ్​ ట్రెయినింగ్​ చేపట్టనున్నట్లు అంచనా వేసింది. అంతేకాదు, ఉద్యోగుల వలస విషయంలో ఈ ఏడాది రికార్డు సృష్టిస్తోందని, మునుపెన్నడూ లేని  విధంగా ఉద్యోగుల వలస రేటు 24 శాతానికి చేరనుందని కూడా టీమ్​లీజ్​ డిజిటల్​ హెడ్​ సునీల్​ సీ చెప్పారు.