నాపై విషప్రయోగం జరిగింది.. ఇస్రో సీనియర్ సైంటిస్ట్

నాపై విషప్రయోగం జరిగింది.. ఇస్రో సీనియర్ సైంటిస్ట్
మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగినట్లు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 23, 2017న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ సమయంలో తనపై విష ప్రయోగం జరిపారని ఆయన అన్నారు. భోజన సమయంలో తాను తీసుకున్న దోశ, చట్నీలలో ప్రాణాంతకమైన ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్ విషం కలిపారని ఆయన ఆరోపించారు. ఈ విషయం గురించి మిశ్రా.. ‘లాంగ్ కెప్ట్ సీక్రెట్’ అనే టైటిల్‌తో తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. తనపై విష ప్రయోగం జరిగిన సమయంలో.. హోం వ్యవహారాల భద్రతా సిబ్బంది తనను కలిసి హెచ్చరించారని ఆయన అన్నారు. అందువల్లే తనకు చికిత్స సులభమైందని ఆయన తెలిపారు. ఈ విష ప్రయోగం వల్ల తనకు శ్వాస ఇబ్బంది, చర్మ మరియు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకాయని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ అందుకోసం వైద్యం చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. గూఢాచర్యంలో భాగంగానే తనపై ఈ విషప్రయోగం జరిగిందని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. కాగా.. మిశ్రా చేసిన ఈ వ్యాఖ్యలపై ఇస్రో ఇంకా స్పందించలేదు. మిశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారునిగా పనిచేస్తున్నారు. ఆయన ఈ నెల చివరిలో తన పదవి నుంచి రిటైర్ కానున్నారు. కాగా.. ఆయన అంతకుముందు అహ్మదాబాద్‌కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌కు (ఇస్రో) డైరెక్టర్‌గా పనిచేశారు. For More News.. కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్‌కు రివార్డును ప్రకటించిన కేంద్రం గుడికొచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తను రేప్ చేసి చంపిన పూజారి