కరోనా టీకా కొవిషీల్డ్ ​వచ్చేవారమే!

కరోనా టీకా కొవిషీల్డ్ ​వచ్చేవారమే!
కరోనా టీకాకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం 28 లేదా 29న పర్మిషన్​ ఇవ్వనున్న బ్రిటన్​.. అంతకుముందే మన దేశంలో పర్మిషన్​ వస్తే ఆ టీకాకు లైన్​ క్లియర్​ చేసిన ఫస్ట్​ దేశంగా ఇండియా కేంద్ర ప్రభుత్వం అడిగిన డేటాను సీరమ్​ ఇచ్చిందన్న అధికారులు టీకాపై బ్రిటన్​ రెగ్యులేటరీ అసెస్​మెంట్​నూ పరిశీలిస్తోందని వెల్లడి 5 కోట్ల నుంచి 6 కోట్ల డోసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సీరమ్​ న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్​కు బ్రిటన్​ చాలా రోజుల కిందటే ఓకే చెప్పేసింది.. ఆ బాటలోనే అమెరికా వెళ్లింది. ఆ రెండు దేశాల కన్నా ముందే రష్యా జనానికి టీకాలేస్తోంది. మరి, మన దేశంలో ఎప్పుడు! ఈ ప్రశ్నకు ‘వచ్చే వారం’ అన్న బదులొస్తోంది. బ్రిటన్​లోని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా కంపెనీలు కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​కు కేంద్ర ప్రభుత్వం వచ్చే వారమే ఓకే చెప్పే అవకాశాలున్నాయని ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. కొవిషీల్డ్​ పేరుతో మన దేశంలో సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా తయారు చేస్తున్న ఆ టీకాకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనని అంటున్నారు. వ్యాక్సిన్​ మంచిగనే ఉంది వ్యాక్సిన్​ ఎమర్జెన్సీ అనుమతులకు సీరమ్​ ముందే దరఖాస్తు చేసుకుందని, అయితే, డిసెంబర్​ 9న జరిగిన రివ్యూలో.. టీకా ట్రయల్స్​కు సంబంధించి మరింత సమాచారాన్ని కరోనా వ్యాక్సిన్​ ఎక్స్​పర్ట్​ కమిటీ సీరమ్​ను అడిగిందని అధికారులు చెప్పారు. వ్యాక్సిన్​పై బ్రిటన్​ రెగ్యులేటరీ అభిప్రాయాలు, అసెస్​మెంట్​కు సంబంధించిన డేటానూ అడిగిందన్నారు. ఆ డేటాను సోమవారం సీరమ్​ అందజేసిందని, దానిపై డ్రగ్​ కంట్రోల్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) సంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు. వ్యాక్సిన్​ బాగుందన్న అభిప్రాయానికి డీసీజీఐ వచ్చినట్టు తెలుస్తోందన్నారు. ఇండియా ట్రయల్స్​ డేటాకు మరి కొంత టైం బ్రిటన్​, బ్రెజిల్​లో జరుగుతున్న ట్రయల్స్​ డేటాను సీరమ్​ ముందే అందజేసింది. అయితే, మన దేశంలో జరుగుతున్న లేట్​ ఫేజ్​ ట్రయల్స్​ (ఫేజ్​2/3) చివరి దశలో ఉన్నందున ఆ డేటాను ఇచ్చేందుకు మరికొంత టైం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్​పై బ్రిటన్​ రెగ్యులేటరీ రివ్యూలనూ కేంద్రం పరిశీలిస్తోందని అధికారులు చెబుతున్నారు. అక్కడి డేటాతో పాటు సీరమ్​ చేస్తున్న ట్రయల్స్​ డేటానూ సమాంతరంగా పరిశీలిస్తున్నామన్నారు. దాంతో పాటు ఎమర్జెన్సీ అనుమతులకు ఫైజర్​ పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు మరో అధికారి చెప్పారు. ఈ నెలాఖరులోపు ఫైజర్​ వ్యాక్సిన్​పైనా నిర్ణయం తీసుకునే చాన్స్​ ఉందని వివరించారు. మన దేశమే ఫస్ట్​ వచ్చే వారమే ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​కు మన దేశం లైన్​ క్లియర్​ చేస్తే.. ప్రపంచంలో ఆ వ్యాక్సిన్​ను అనుమతించిన మొదటి దేశంగా ఇండియా నిలుస్తుంది. నిజానికి బ్రిటన్​లో ముందే అనుమతి ఇవ్వాల్సి ఉన్నా.. ట్రయల్స్​కు సంబంధించి మరింత డేటాను ఆ దేశ సర్కార్​ అడగడంతో అప్రూవల్​ లేట్​ అయింది. డిసెంబర్​ 28 లేదా 29 నాటికి అక్కడా అనుమతి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఎప్పుడైనా డోసులిచ్చేందుకు రెడీ అనుమతులతో పాటు టీకా డోసులపైనా కేంద్రం, సీరమ్​ మధ్య చర్చలు జరుగుతున్నట్టు అధికారులు చెప్పారు. దానిపై ఈ వారంలో ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు డోసులను ఇచ్చేందుకు సీరమ్​ రెడీగా ఉందన్నారు. మొదట్లో 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కొవిషీల్డ్​ డోసులు అందే అవకాశాలున్నాయని చెప్పారు. జులై నాటికి 40 కోట్ల డోసుల తయారీని సీరమ్​ టార్గెట్​ పెట్టుకుంది. అయితే, కొన్నాళ్ల క్రితం చేసిన ఇంటరిమ్​ అనాలిసిస్​లో ‘రెండు ఫుల్​ డోసుల’ ఆక్స్​ఫర్డ్​ ఎఫికసీ 62 శాతమే ఉన్నట్టు తేలింది. మొదట ఒకటి, తర్వాత రెండో డోసు ఇచ్చిన చిన్న గ్రూపులో 90% ప్రభావం చూపినట్టు డేటా పేర్కొంది. ఎఫికసీ తక్కువే ఉన్నా తాజా పరిస్థితుల్లో 2 ఫుల్​ డోసులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆక్స్​ఫర్డ్​ టీకానే ఎందుకు? మన దేశంతో పాటు చాలా చిన్న, మధ్యతరగతి దేశాలు ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ మీదే ఆశలు పెట్టుకున్నాయి. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ఆక్స్​ఫర్డ్​ టీకా రేటు తక్కువ. ఏ టెంపరేచర్లలోనైనా దాచే వీలుంది. మామూలు ఫ్రిజ్​లలోనూ స్టోర్​ చేసుకోవచ్చు. కాబట్టి వేడి ఎక్కువగా ఉండే దేశాల్లో ఆక్స్​ఫర్డ్​ టీకా స్టోరేజీ, సప్లై చెయిన్​కు ఆటంకాలుండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఫైజర్​ టీకాను మైనస్​ 70 డిగ్రీల టెంపరేచర్​ వద్ద స్టోర్​ చేయాల్సి ఉంటుంది. మామూలు ఫ్రిజ్​లలో 5 రోజులకు మించి ఉండదని కంపెనీ ప్రతినిధులే చెబుతున్నారు. పైగా వ్యాక్సిన్​ తరలింపులో అలా టెంపరేచర్లు మెయింటెయిన్​ చేయడం  కష్టమైన పనే. అందుకే ముందు ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​కు కేంద్రం ఓకే చెప్పే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త కరోనాపైనా మస్తు పన్జేస్తది: ఆస్ట్రాజెనికా కొత్త రకం కరోనాపై ఇప్పుడున్న వ్యాక్సిన్లు పన్జేస్తయా అని కలవరపడుతున్నాయి చాలా దేశాలు. అయితే, తమ వ్యాక్సిన్​ మస్తు పన్జేస్తదని అంటోంది ఆస్ట్రాజెనికా. బ్రిటన్​లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్​పైనా తమ వ్యాక్సిన్​ ప్రభావం బాగానే ఉంటుందని, మ్యుటేషన్​ ఇంపాక్ట్​ ఎంతుంటుందో రీసెర్చ్​ చేస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. కరోనా వైరస్​లోని స్పైక్​ ప్రొటీన్​ ఆధారంగానే వ్యాక్సిన్​ను తయారు చేస్తున్నామని, ప్రస్తుతం రూపం మార్చుకున్న కరోనా వైరస్​లో స్పైక్​ ప్రొటీన్లలో అంతగా మార్పులేమీ కనిపించట్లేదని, కాబట్టి వ్యాక్సిన్​ ప్రభావంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. వైరస్​లోని ఏ స్పైక్​ ప్రొటీన్​నైనా మన ఇమ్యూన్​ సిస్టమ్​ గుర్తించేలా వ్యాక్సిన్​ డెవలప్​ చేశామని, ఒక్క స్పైక్​లో మార్పులొచ్చినా వేరే స్పైక్స్​ను వ్యాక్సిన్​ను గుర్తించగలదని వివరించారు. For More News.. కరోనా వ్యాక్సిన్.. ఇంట్రెస్ట్ చూపించని జనం