రాణించిన శ్రేయస్, పంత్..వెస్టిండీస్ టార్గెట్ 266

రాణించిన శ్రేయస్, పంత్..వెస్టిండీస్ టార్గెట్ 266

థర్డ్ వన్టేలో వెస్టిండీస్ కు 266 పరుగుల టార్గెట్ ను నిర్దేశించి భారత్. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత టాప్ ఆర్డర్ రోహిత్ 13, ధావన్ 10, కోహ్లీ డకౌట్ అయినా .. శ్రేయస్, అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. శ్రేయస్ అయ్యార్ 80, రిషబ్ పంత్ 56 పరుగులతో  స్కోరు బోర్డును నిలబెట్టారు. చివరలో వచ్చిన వాషింగ్టన్ సుందర్, 33, దీపక్ చాహర్ 38 పరుగులు చేయడంతో భారత్ 265 పరుగులు చేయగల్గింది. వెస్టిండీస్ బౌలర్లలో  జేసన్ హోల్డర్ 4, వాష్ 2, జోసఫ్ 2, స్మిత్, అలెన్ లకు చెరో వికెట్ పడ్డాయి. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ లో భారత్ 2 మ్యాచ్ లు నెగ్గి  కైవసం చేసుకుంది.

 

మరిన్ని వార్తలు