అహ్మదాబాద్లో బుధవారం జరిగిన ఇండియా–వెస్టిండీస్ సెకండ్ వన్డే సందర్భంగా అండర్–19 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్ను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. బ్లాక్ బ్లేజర్స్ ధరించిన కుర్రాళ్లు.. మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, సపోర్ట్ స్టాఫ్, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. ప్లేయర్లకు రూ. 40 లక్షలు, సపోర్ట్ స్టాఫ్కు రూ. 25 లక్షల నజరానాను బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
