నౌకాదళం శత్రు దుర్భేధ్యం.. క్షిపణి పరీక్ష సక్సెస్

నౌకాదళం శత్రు దుర్భేధ్యం.. క్షిపణి పరీక్ష సక్సెస్

నౌకాదళాన్ని శత్రు దుర్భేధ్యంగా మార్చేందుకు దోహదపడే ‘వీఎల్- ఎస్ఆర్ఎస్ఏఎం’ స్వల్ప శ్రేణి క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఓ నౌక నుంచి ఈ ప్రయోగ పరీక్షను నిర్వహించారు. నిట్ట నిలువు (వర్టికల్) గా క్షిపణిని ప్రయోగించగా..  లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. గగనతలం నుంచి యుద్ధ నౌకలకు ముప్పు లేకుండా కాపాడేందుకు ఈ క్షిపణి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగ పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. పరీక్ష విజయవంతం అయిన సందర్భంగా శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి  అభినందించారు. హైస్పీడ్ గగనతల లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించిందని పేర్కొన్నారు.