డిజిటల్ పేమెంట్లు పెరిగినయ్.. డేటా ప్రైవసీలో రాజీ వద్దు

డిజిటల్ పేమెంట్లు పెరిగినయ్.. డేటా ప్రైవసీలో రాజీ వద్దు
  • ఫిన్​టెక్​ ఫెస్ట్​లో ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ: డిజిటల్​ పేమెంట్లు వాడే వారి సంఖ్య బాగా పెరిగిన నేపథ్యంలో డేటా ప్రైవసీ విషయంలో రాజీ పడవద్దని ఫైనాన్స్ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ సూచించారు. క్లయింట్ల డేటాను భద్రంగా కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఫిన్​టెక్​ వినియోగంలో గ్లోబల్​ సగటు 64 శాతమైతే, మన దేశంలో అది 87 శాతంగా ఉందని చెప్పారు. జనవరి–ఆగస్టు మధ్య కాలంలో దేశంలో డిజిటల్​ ట్రాన్సాక్షన్లు రూ. 6 లక్షల కోట్లకు పెరిగాయని, అంతకు ముందు ఏడాది ఇవి రూ. 4 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. డేటా ప్రైవసీ చాలా ముఖ్యమైనదని, ఇందులో అందరికీ ఒకేలాంటి అభిప్రాయం ఉండకపోవచ్చని అంటూనే, కాకపోతే ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత తప్పనిసరని నిర్మలా సీతారామన్​ చెప్పారు.

గ్లోబల్​ ఫిన్​టెక్​ ఫెస్ట్​ 2021లో ఫైనాన్స్​ మినిస్టర్​ పాల్గొన్నారు. డిజిటల్​ పేమెంట్లకు పాటించాల్సిన గైడ్​లైన్స్​పై యునైటెడ్​ నేషన్స్​ తెచ్చిన రిపోర్టును ఈ సందర్భంగా విడుదల చేశారు. డిజిటల్​ పేమెంట్ల విషయంలో గవర్నమెంట్లు, యూజర్లు, ఇండస్ట్రీ, బిజినెస్​లు పాటించడానికి తగిన మార్గదర్శకాలు ఈ రిపోర్టులో ఉన్నాయి. ఫిన్​టెక్​లో మహిళలు మరింత మంది చురుగ్గా పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉందని ఈ రిపోర్టు వెల్లడించింది. యూఎన్​ రిపోర్టు విడుదలకు ఇదే సరయిన సమయమని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. డిజిటల్​ పేమెంట్ల కోసం తీసుకొచ్చే ఇంటరాపరబుల్​ సిస్టమ్​ పారదర్శకంగా ఉండాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీచర్ల విషయంలో రాజీ పడకూడదని పిలుపు ఇచ్చారు. డిజిటల్​ పేమెంట్లు, డిజిటల్​ యాక్టివిటీస్​లో గ్లోబల్​గా  అందరి కంటే  మన దేశమే ముందు నడుస్తోందని చెప్పారు.