ట్యాక్స్ చెల్లిస్తున్నారా..? అయితే మీకో శుభవార్త

ట్యాక్స్ చెల్లిస్తున్నారా..? అయితే మీకో శుభవార్త

న్యూఢిల్లీ : టాక్స్​ రిఫండ్​ కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్రం  బుధవారం ఊరటనిచ్చే కబురు చెప్పింది.   రూ 5 లక్షల వరకూ పెండింగ్‌లో ఉన్న అన్ని ఐటీ రిఫండ్స్‌ను  వెంటనే  చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 14 లక్షల మంది  పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఫైనాన్స్​ మినిస్ట్రీ  పేర్కొంది.   అదేవిధంగా జీఎస్టీ, కస్టమ్‌ రిఫండ్స్‌నూ  వెంటనే చెల్లించాలని నిర్ణయించడం వల్ల సుమారు లక్షల మంది వ్యాపారులకు ప్రయోజనం లభించనుంది. 18 వేల కోట్ల పన్ను రిఫండ్లను ప్రభుత్వం చెల్లించనున్నట్టు ఫైనాన్స్​ మినిస్ట్రీ   రిలీజ్​ చేసిన ప్రకటన వివరించింది.