ఈ-ఫైలింగ్ పోర్టల్లో సెర్చ్ ఆప్షన్ సరిగా పనిచేయకపోవడాన్ని పరిశీలించాల్సిందిగా సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ఫోసిస్ను ఆదేశించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. I-T పోర్టల్ను యాక్సెస్ చేస్తున్నప్పుడు చాలా మంది వినియోగదారులు సమస్యల గురించి ఫిర్యాదు చేశారని, హ్యాక్ చేశారని ఆరోపించారని తెలిపారు.
“ఇ-ఫైలింగ్ వెబ్సైట్ సెర్చ్ ఫంక్షనాలిటీకి సంబంధించిన సమస్య మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ ను పరిశీలించవలసిందిగా ఆదేశించాం. వారు ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు ”అని I-T డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది.
అయితే పోర్టల్లో ఎలాంటి డేటా ఉల్లంఘన జరగలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా హామీ ఇచ్చారు. యాదృచ్ఛికంగా జరిగిన మరో విషయమేమిటంటే నేటికి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ను ప్రారంభించి సంవత్సరం కావడం. గత సంవత్సరంలోనూ కొన్ని సార్లు పోర్టల్ పనిచేయకపోవడం వల్ల.. ట్యాక్స్ రిటర్స్ కి, సంబంధిత ఫామ్స్ ను ఫిల్ చేయడానికి గడువు తేదీని పొడిగించమని కూడా కొందరు అప్పట్లో వాదించారు.
