బింద్/న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్లోని బింద్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ ముందు జాగ్రత్తగా పంటపొలాల్లో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఐఏఎఫ్ అధికారి తెలిపారు. ‘అపాచీ ఎహెచ్ 64 హెలికాప్టర్ ఎంపీలోని బింద్లో ల్యాండ్ అయింది. రొటీన్ ఆపరేషనల్ ట్రైనింగ్లో పైలట్ హెలికాప్టర్లో స్వల్ప సమస్యలను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. హెలికాప్టర్లోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. సంఘటన స్థలానికి రెస్క్యూ టీమ్ను పంపించాం’ అని ఐఏఎఫ్ ట్వీట్చేసింది.
