ఆన్​లైన్​ లోన్లే ఇష్టపడుతున్నారట

ఆన్​లైన్​ లోన్లే ఇష్టపడుతున్నారట

న్యూఢిల్లీ: ఆన్​లైన్​లో లోన్లు పొందడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్లు హోమ్​ క్రెడిట్​ సర్వేలో తేలింది. మిలినియల్స్​, యువతరం ఆన్​లైన్​వైపే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్​ ప్లాట్​ఫామ్స్​కి మారేందుకు ఇష్టపడుతున్నట్లు 40 శాతం మంది బారోవర్లు చెప్పారని, ఇప్పటికే 15 శాతం మంది ఆన్​లైన్​ బాట పట్టారని పేర్కొంది. దేశంలోని 9 సిటీలలో 1200 మంది కస్టమర్లతో ఈ సర్వే నిర్వహించారు. కస్టమర్లు తీసుకున్న అప్పులు 2020 తో పోలిస్తే ఈ ఏడాది 50 శాతం పెరిగాయి. ఇంటి అవసరాల కోసం చేసే అప్పులు మాత్రం తగ్గాయి.  కరోనా  వచ్చినప్పటి నుంచీ డిజిటలైజేషన్​ ఊపందుకుందని సర్వే రిపోర్టు వివరించింది.