స్టూడెంట్స్‌ను రోడ్డున పడేసిన కాలేజీ

స్టూడెంట్స్‌ను రోడ్డున పడేసిన కాలేజీ

హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ అనుమతి లేకుండానే బీఈడీ అడ్మిషన్లు ఇచ్చిన ఓ కాలేజీ మేనేజ్ మెంట్.. స్టూడెంట్స్ ను రోడ్డున పడేసింది. ఏడాదిపాటు చదివి, తీరా ఎగ్జామ్స్  టైమ్ లో ఆ కాలేజీ బోగస్ అని ​తెలియడంతో స్టూడెంట్స్ లబోదిబో మంటున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ ఘటన జరిగింది. మెహదీపట్నంలోని హిదాయ కాలేజ్ ఆఫ్​ఎడ్యుకేషన్ ఈ అకడమిక్ ఇయర్ లో 67 మందికి అడ్మిషన్స్ ఇచ్చింది. ఒక్కో స్టూడెంట్ నుంచి రూ.60వేల నుంచి రూ.లక్ష వరకూ ఫీజులు వసూలు చేసింది.  క్లాసులూ జరిగాయి.  ఈ నెల 1 నుంచి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్​మొదలయ్యాయి. అయితే స్టూడెంట్స్ కు హాల్​టికెట్లు రాలేదు. వారంతా కాలేజీ మేనేజ్ మెంట్ ను నిలదీశారు. మోసపోయినట్లు తెలుసుకున్న స్టూడెంట్స్ కాలేజ్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వేడుకున్నారు. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్​పాపిరెడ్డిని కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి కాలేజీ పర్మిషన్​ తీసుకోలేదని, తామేమీ చేయలేమని చెప్పడంతో స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.