వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు ఆగస్టు 3న తీర్పు వెలువరించనుంది. అప్పటి వరకు భారత పురావస్తు శాఖ తనిఖీపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రిీతింకర్ దివాకర్ సర్వేపై మధ్యంతర స్టేను ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని తెలిపారు. అంతకు ముందు జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలన్న కింది కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే పొడిగించింది. జ్ఞానవాపి మసీదును ఓ ఆలయంపై నిర్మించారా అనే విషయంపై సర్వే నిర్వహించాలంటూ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ను జిల్లా కోర్టు ఆదేశించింది. దీనిపై అంజుమన్ ఇంతెజామియా మస్జీద్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వేను ఈ రోజు వరకు స్టే విధించింది.
తాజాగా కోర్టులో హాజరైన ఏఎస్ఐ నిపుణుడు.. ఆగస్టు 4 నాటికి సర్వే పూర్తి చేస్తామని చెప్పారు. నిర్మాణాన్ని పాడుచేయబోమని, బ్రషింగ్ను ఉత్తమంగా ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. అయితే అంజుమాన్ కమిటీ ఈ వాదనను ఖండించింది. "తవ్వకాలు జరగడం లేదని చెప్పడానికి వారు తమ స్థాయికి మించి ప్రయత్నించారు, వారు స్పేడ్లను ఉపయోగించినట్లు చూపించే ఫోటోలను కూడా మేము జోడించాము. వారు ఈ పరికరాలతో అక్కడికి చేరుకున్నారు... స్టే మంజూరు చేయబడినందున, వారు దానిని ఉపయోగించలేరు" అని తెలిపారు. అయితే, ఎవరైనా ఆయుధంతో కోర్టుకు వస్తే దానిని ఉపయోగిస్తారని అర్థం కాదని జస్టిస్ దివాకర్ అన్నారు.
