రేపు జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్

రేపు జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్

న్యూఢిల్లీ: ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ నాయకత్వంలో జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్​ శుక్రవారం జరగనుంది. జీఎస్​టీ రేట్ల రేషనలైజేషన్​కోసం ఏర్పాటయిన మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఈ మీటింగ్​లో చర్చించనున్నారు. ఈ జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్​కు సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. కొన్ని వస్తువులపై జీఎస్​టీ మార్పు ప్రపోజల్స్​ను కూడా ఇందులో డిస్కస్​ చేస్తారు. 46 వ జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్​ న్యూఢిల్లీలో డిసెంబర్​ 31 న జరగనుందని ఒక ఆఫీసర్​ చెప్పారు. ఉదయం 11 గంటలకు మీటింగ్​ మొదలవుతుందని తెలిపారు. గార్మెంట్స్​, చెప్పులు, చేనేత ఉత్పత్తులపై జీఎస్​టీ పెంపుపై వివిధ రాష్ట్రాలు అభ్యంతరాలు ప్రకటించడంతో వాటిని కూడా మీటింగ్​లో సమీక్షించనున్నారు.

టెక్స్​టైల్స్​పై జీఎస్​టీని 12 శాతానికి పెంచడం తగదని వెస్ట్​ బెంగాల్​ ఫైనాన్స్​ మినిస్టర్​ అమిత్​ మిత్రా చెప్పారు. దీనిని మళ్లీ 5 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఈ పెంపుదల వల్ల లక్ష ​యూనిట్లు మూతపడతాయని, 15 లక్షల మంది ఉద్యోగాలు పోతాయని మిత్రా చెప్పారు. ఇటీవల ప్రకటించిన జీఎస్​టీ పెంపుదలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఇండస్ట్రీస్​ మినిస్టర్​ కే టీ రామారావు కూడా కోరారు. టెక్స్​టైల్స్​, గార్మెంట్స్​పై జీఎస్​టీ పెంచడాన్ని  ఆ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పేదలకు బట్టలు ఖరీదవడంతోపాటు, తమ కంప్లయెన్స్​ ఖర్చులూ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. చేనేత వర్గాల నుంచీ పెంపుదలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ. వెయ్యిలోపు చెప్పులపై జీఎస్​టీ పెంపు ప్రపోజల్​ వాయిదాపై కూడా జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్​లో చర్చ జరగనుంది.