ఫెర్టిలైజర్లకు ప్రొడక్షన్​ సబ్సిడీ

ఫెర్టిలైజర్లకు ప్రొడక్షన్​ సబ్సిడీ

న్యూఢిల్లీ: ఫాస్ఫేటిక్​, పొటాషిక్​ ఫెర్టిలైజర్ల దేశీయ ప్రొడక్షన్​ పెంచేలా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. గ్లోబల్​గా ఆ ఫెర్టిలైజర్ల రేట్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఒక కొత్త విధానాన్ని తీసుకు రానున్నట్లు తెలిపింది. కేంద్ర కెమికల్స్​, ఫెర్టిలైజర్స్​ శాఖ మంత్రి మన్షుఖ్​ మాండవీయ నాయకత్వంలోని  హైలెవెల్​ మీటింగ్​లో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఫెర్టిలైజర్స్​ మంత్రిత్వ శాఖ ఒక స్టేట్​మెంట్లో పేర్కొంది. ఆత్మనిర్భర్​ భారత్​ కింద ఫాస్ఫేటిక్​, పొటాషిక్​ ఎరువుల ప్రొడక్షన్ మన దేశంలోనే పెరిగేలా చొరవ తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో న్యూట్రియంట్​ బేస్డ్​ సబ్సిడీ (ఎన్​బీఎస్​) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో కొన్ని మార్పులు చేసి కొత్త విధానం తేనున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఎన్​బీఎస్​ విధానాన్ని 2010 ఏప్రిల్​ నుంచి దేశంలో అమలు చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి సబ్సిడీని   చెల్లిస్తున్నారు.