నేషనల్​ హైవేపై వాహనదారులకోసం రాజ్​మార్గ్​యాత్ర యాప్​

నేషనల్​ హైవేపై వాహనదారులకోసం రాజ్​మార్గ్​యాత్ర యాప్​

న్యూఢిల్లీ: జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా( ఎన్​హెచ్​ఎఐ) కొత్త మొబైల్​యాప్​ను ప్రవేశపెట్టింది. రాజ్​మార్గ్​ యాత్ర పేరిట ప్రారంభించిన ఈ యాప్​ద్వారా  యూజర్లు హైవేల పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. సమస్యలపై కూడా ఫిర్యాదు చేయొచ్చు. ​ ఈ యాప్ ను గూగుల్​ ప్లేస్టోర్, ఐఓఎస్​ యాప్​స్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఇది​ ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్​ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉందని కేంద్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్​, హైవేస్ ​మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

నేషనల్​ హైవేలో ప్రయాణించే వాహనదారులు ఈ యాప్​ ద్వారా రియల్​టైమ్​ వెదర్​ కండిషన్స్, సమీప టోల్​ప్లాజాల వివరాలు, పెట్రోల్​ బంకులు, ఆస్పత్రులు, హోటల్స్, ఇతర అత్యవసర సేవల సమాచారం తెలుసుకోవచ్చు. ఫొటో, వీడియోల జియో ట్యాగింగ్​ ద్వారా హైవేలకు సంబంధించిన సమస్యలపై యాప్​లో ఫిర్యాదు చేయొచ్చు. యాప్​లోని టెక్నాలజీ ద్వారా కంప్లయింట్​ఉన్నతాధికారులకు చేరుతుంది. ఈ యాప్​ ద్వారా ఫాస్టాగ్ రీచార్జ్, మంత్లీ పాస్​లు వంటి సేవలను సైతం పొందొచ్చు. వాహనం పరిమిత వేగాన్ని మించి ప్రయాణిస్తుంటే ఈ యాప్​ ఓవర్​స్పీడ్​ నోటిఫికేషన్లు కూడా పంపుతుంది.