న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను బ్యాన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. అందుకోసం ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్2021’ను ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. క్రిప్టో కరెన్సీల కోసం వాడే టెక్నాలజీ (బ్లాక్చెయిన్) ని మాత్రం ప్రమోట్ చేసేందుకు, ఆర్బీఐ తెచ్చే అఫీషియల్ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయడానికీ బిల్లులో రూల్స్ను పొందుపరిచినట్టు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీపై పార్లమెంటరీ పానెల్ ఇప్పటికే కొన్ని సిఫార్సులను చేసింది. దానిని నిషేధించడం కరెక్ట్ కాదని, కాకపోతే నియంత్రించాలని ఈ పానెల్ ప్రభుత్వానికి సూచించింది. ఆర్బీఐ మాత్రం క్రిప్టోను రద్దు చేస్తేనే మేలని అంటోంది. యువతను క్రిప్టో వైపు మళ్లించే ప్రకటనలపై చర్యలు అవసరమని పార్లమెంటరీ పానెల్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన హైలెవెల్ మీటింగ్ తర్వాత ఈ పార్లమెంటరీ పానెల్ మీటింగ్ జరిగింది. ప్రధాన మంత్రితో మీటింగ్లో వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతోపాటు, ఆర్బీఐ అధికారులూ పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీని దేశంలో నిషేధించడమే మేలని, మాక్రో ఎకనమిక్ స్టెబిలిటీని అది దెబ్బతీస్తుందని రిజర్వ్ బ్యాంకు మొదటి నుంచీ అభిప్రాయపడుతోంది. కాగా, ఆర్బీఐ సొంతంగా ఓ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పైలట్ప్రాజెక్టుగా దానిని అమలు చేసే తేదీపై కసరత్తులను ప్రారంభించింది. దాని సాధ్యాసాధ్యాలపై స్టడీ చేస్తోంది.
