న్యూఢిల్లీ: కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను త్వరగా పట్టాలెక్కించడానికి ఉత్పాదక రంగాలకు ఎక్కువ అప్పులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) కోరింది. బ్యాంకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఫిన్టెక్లతో పార్ట్నర్షిప్లకు, కో–లెండింగ్ బిజినెస్కు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరింది. రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ రికవరీకి దోహదపడుతున్న ఫైనాన్షియల్ టెక్నాలజీతోపాటు ఇతర సెక్టార్లకూ అప్పులు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పీఎస్బీ బాసులకు స్పష్టం చేసింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పీఎస్బీల పనితీరుపై రివ్యూ చేసింది. మరింత ఎక్కువగా లోన్లు ఇవ్వడానికి టెక్నాలజీని, డేటా అనలిటిక్స్పై దృష్టి పెట్టాలని బ్యాంకులను కోరింది. మోసాలను అరికట్టేందుకు ఐటీ భద్రతా వ్యవస్థలను, సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లను మంత్రిత్వ శాఖ కోరింది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం, పీఎస్బీల లోన్ల గ్రోత్ ఏడాది క్రితం 3.6శాతం నుండి 2022 మార్చిలో 7.8శాతంకి మెరుగుపడింది. కొన్ని పీఎస్బీలు 26 శాతం గ్రోత్ని రికార్డు చేశాయి కూడా.
