అక్టోబరు 5న గద్దర్ విగ్రహావిష్కరణ

అక్టోబరు 5న గద్దర్ విగ్రహావిష్కరణ

పంజాగుట్ట, వెలుగు: నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్​మండలం మన్ననూర్​లో అక్టోబరు 5న ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నట్టు గద్దర్​గళం ప్రకటించింది. సోమవారం ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో గద్దర్​బిడ్డ వెన్నెల పాల్గొని విగ్రహావిష్కరణ పోస్టర్ ను విడుదల చేశారు. 

విగ్రహాన్ని ప్రొఫెసర్​కంచె ఐలయ్య ఆవిష్కరిస్తారని కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్​తెలిపారు. అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి, విమలక్క, సీనియర్​జర్నలిస్టు పాశం యాదగిరి పాల్గొంటారని చెప్పారు. డాక్టర్​బాలబోయిన సుదర్శన్, కాంగ్రెస్​ కౌన్సిలర్​కొల్లూరి భరత్, ఏపూరి సోమన్న పాల్గొన్నారు.