భారతీయుల్లారా క్షమించండి: నషీద్

భారతీయుల్లారా క్షమించండి: నషీద్

న్యూఢిల్లీ: భారత్​తో దౌత్య వివాదం వల్ల తలెత్తిన పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్​ నషీద్​ ఆందోళన వ్యక్తంచేశారు. పర్యాటకంపరంగా ఇండియా ఇచ్చిన బాయ్​కాట్​కాల్​పై ఆయన స్పందించారు. భారత్​ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు  మీడియాతో మాట్లాడారు.  ‘దౌత్య వివాదం, బాయ్​కాట్​ పిలుపు మాల్దీవులపై చాలా ప్రభావం చూపింది.  జరిగినదానికి మాల్దీవుల ప్రజల తరఫున క్షమాపణలు కోరుతున్నా. 

ఈ సెలవుల్లో ఎప్పటిలాగే భారత ప్రజలు మాల్దీవులకు రండి. మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పు ఉండదు’ అని నషీద్​  విన్నవించారు.  మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్​ ముయిజ్జు భారత దళాలను దేశం విడిచి వెళ్లిపోవాలని కోరినప్పుడు ఇండియా సంయమనంతో వ్యవహరించిందని నషీద్ కొనియాడారు. కాగా, దౌత్య వివాదంతో మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య నిరుడితో పోలిస్తే 33 శాతం తగ్గినట్లు అంచనా.