28 మంది జవాన్లకు ఫుడ్‍పాయిజన్‍

28 మంది జవాన్లకు ఫుడ్‍పాయిజన్‍
  • వాడిన నూనె నిల్వ ఉంచి వంటలు చేయడమే కారణం 

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్‍స్టేషన్‍ పరిధిలో ఉన్న సీఆర్‍పీఎఫ్‍ బేస్‍క్యాంపులో 28 మంది జవాన్లకు శుక్రవారం ఫుడ్‍పాయిజన్​అయ్యింది. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని స్థానిక సీఆర్‍పీఎఫ్ ​ఫీల్డ్​దవాఖానాలో చేర్చి ట్రీట్​మెంట్ ​అందించారు. ఇందులో 12 మందికి ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. 150వ బెటాలియన్‍ 'సీ' కంపెనీకి చెందిన వీరంతా.. వాడిన నూనెను నిల్వ ఉంచి  మళ్లీ ఆహారం​ తయారు చేసుకుని తినడంతోనే ఫుడ్​పాయిజన్​ అయ్యిందని క్యాంపు కమాండెంట్‍ రాజేశ్‍యాదవ్‍ తెలియజేశారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రమాదం లేదని, అందరూ బాగానే ఉన్నారన్నారు.