న్యూఢిల్లీ: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను పెంచేందు కు ప్రభుత్వం కొత్త స్కీమ్తో వచ్చింది. ఐటీఆర్లను ఫైల్ చేయించే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెనూర్లు (వీఎల్ఈ) ఈ స్కీమ్ కింద రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను, రూ. లక్ష వరకు క్యాష్ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. దేశంలోని సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లోని 75 వేల కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ) ఐటీఆర్ ఫైలింగ్ సర్వీస్లను అందిస్తున్నాయి. సీఎస్సీ సెంటర్లను వీఎల్ఈలు ఆపరేట్ చేస్తుంటారు. వెయ్యి కంటే ఎక్కువ ఐటీఆర్లను ఫైల్ చేసే వీఎల్ఈలు లక్కీ డ్రాలో పాల్గొనేందుకు వీలుంటుంది. ఈ నెల 31 లోపు 25 లక్షల ఐటీఆర్లు ఫైల్ అవుతాయని ఈ సంస్థ అంచనావేస్తోంది. ఈ– ఫైలింగ్ కోసం పాన్ కార్డు, ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ఎలా వస్తుందో చెప్పే డిటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి డిటెయిల్స్తో సీఎస్సీలో ఇవ్వాలి. 3–7 రోజుల్లో ఈ–వెరిఫైడ్ అవుతుంది. తర్వాత ఐటీఆర్ ఫైలింగ్ పూర్తయినట్టు ఎక్నాలడ్జ్మెంట్ వస్తుంది.
