రైతులు కేంద్ర సర్కార్‌‌ను దిగొచ్చేలా చేశారు

రైతులు కేంద్ర సర్కార్‌‌ను దిగొచ్చేలా చేశారు

శ్రీనగర్: రైతులు తమ శాంతియుత నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేశారని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తమ నిరసనల ద్వారా అన్నదాతలు ఎండగట్టారని చెప్పారు. ‘రైతులు ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేశారు. ప్రజాశక్తికి బీజేపీ భయపడుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌‌లో అణచివేసే పాలన జరుగుతోంది. ప్రశాంతంగా నిరసనలు తెలిపేందుకు కూడా అవకాశం కల్పించడం లేదు’ అని మెహబూబా పేర్కొన్నారు.