బాస్మతి బియ్యం, ప్రాసెస్డ్​ ఆహార ఉత్పత్తుల ఎగుమతి పెరిగింది

బాస్మతి బియ్యం,  ప్రాసెస్డ్​ ఆహార ఉత్పత్తుల ఎగుమతి పెరిగింది

న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో 25.54 శాతం పెరిగి 1.15 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.  క్రితం ఏడాది ఇదేకాలంలో ఎగుమతుల విలువ  922 మిలియన్​ డాలర్లు ఉంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల విలువ కూడా జూన్ క్వార్టర్​లో 5 శాతం పెరిగి 1.56 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

అగ్రికల్చరల్​, ప్రాసెస్డ్​ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 31 శాతం పెరిగి 7.4 బిలియన్​ డాలర్లకు చేరుకుంది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో  అగ్రికల్చరల్ అండ్  ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌‌పోర్ట్ డెవలప్‌‌మెంట్ అథారిటీ (అపెడా) ద్వారా 23.56 బిలియన్​ డాలర్ల విలువైన అగ్రికల్చరల్,  ప్రాసెస్డ్​ ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయాలని టార్గెట్​విధించారు. ఈ ఉత్పత్తులలో తాజా పండ్లు,  కూరగాయలు,  తృణధాన్యాలు ఉన్నాయి. " ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో మాంసం, పాడి,  పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 9.5 శాతం పెరిగాయి. డెయిరీ ప్రొడక్టుల ఎగుమతుల విలువ 67.15 శాతం పెరిగి 191 మిలియన్ డాలర్లకు చేరుకుంది’’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.