న్యూఢిల్లీ, వెలుగు: ప్రత్యేక నిధులతో క్రిస్టియన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్(ఎన్సీఐసీ) ప్రెసిడెంట్ డానియల్ అడామ్స్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో కేంద్ర మైనార్టీ శాఖ సహాయ మంత్రి జాన్ బార్ల, జాతీయ మైనార్టీ కమిషన్ మెంబర్ రించల్ లేమోను కలిసి వినతి పత్రం ఇచ్చారు. బెనారస్ హిందూ వర్సిటీ, అలీగఢ్ ముస్లిం వర్సిటీ, జామియా మిలియా ఇస్లామీ వర్సిటీ, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ లెక్కనే క్రిస్టియన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం..
