జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు మృతి
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోగా.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. షోపియాన్‌లోని కనిగం ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. దాంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో టెర్రిరిస్టులు ఇద్దరు లేదా ముగ్గురు పాల్గొని ఉండవచ్చని భద్రతా బలగాలు తెలిపాయి. కనిగం ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్న బలగాలు.. కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. For More News.. ఉగాండాలో పడవ బోల్తా.. 26 మంది మృతి దొంగల మధ్య గొడవ.. ఓ దొంగ గొంతుకోసి చంపిన మరో దొంగ రాష్ట్ర బీజేపీ నాయకుడిపై దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి