డుకాటి కొత్త బైక్​ 31.48 లక్షలు

డుకాటి కొత్త బైక్​ 31.48 లక్షలు

డుకాటి తన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ అడ్వెంచర్ టూరర్ బైక్​ను మల్టీస్ట్రాడా వీ4 పైక్స్ పీక్ బైకును రూ. 31.48 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లాంచ్​ చేసింది. దీని ధర మల్టీస్ట్రాడా వీ4 ఎస్​ కంటే రూ. 7.33 లక్షలు ఎక్కువ. బైకులోని లిక్విడ్-కూల్డ్ 1,158సీసీ వీ4 ఇంజన్ 10,500 ఆర్​పీఎం వద్ద 170 హెచ్​పీని,  8,750 ఆర్​పీఎం వద్ద 125ఎన్​ఎం పీక్​ టార్క్​ను ఇస్తుంది. ఇందులో ఆరు గేర్లు ఉంటాయి.  

22 లీటర్ల ఇంధన ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమర్చారు.  6.5-అంగుళాల టీఎఫ్​టీ డాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్, డుకాటీ కనెక్ట్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యాప్ నావిగేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డుకాటి రేస్ రైడింగ్ మోడ్, డుకాటి వీలీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏబీఎస్​ కార్నరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి అదనపు ఆకర్షణలు ఉన్నాయి.